గుప్తనిధుల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

54பார்த்தது
జనగామ జిల్లా కొడకండ్లలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయంటూ డబ్బులు దోచిన ముఠాను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వేములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ నమ్మబలికి 9లక్షలు20 వేల రూపాయలు తీసుకొని మరోసారి పూజకు 7 లక్షల రూపాయలు కావాలని అడగడంతో పోలీసులను ఆశ్రయించగా ఎస్సై శ్రావణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ, సురేష్ లను పట్టుకొని డబ్బులను రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు.