AP: మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. మెహబూబ్ షరీష్ అనే బాలుడు జగన్ పులివెందుల వస్తున్నారని కాళ్ళకు చెప్పులు లేకపోయినా ఎండలో 5 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. జగన్ను చూసిన షరీఫ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఏం జరిగిందని జగన్ ఆరాతీయగా తను షేక్హ్యాండ్ ఇచ్చి ఫొటో దిగాలన్న కోరాడు. దీంతో జగన్ షరీఫ్ను ఓదార్చి ఫొటో దిగి.. బాగా చదువుకోవాలని సూచించి ఇంటకి పంపారు.