పట్టాలు తప్పి పొలంలోకి దూసుకెళ్లిన రైలు ఇంజిన్ (వీడియో)

56பார்த்தது
బీహార్‌లోని గయలో శనివారం పెను ప్రమాదం తప్పింది. వజీర్‌గంజ్ స్టేషన్, కొల్హానా హాల్ట్ మధ్య రఘునాథ్‌పూర్ గ్రామ సమీపంలో రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. లోక్‌పైలట్ రైలు ఇంజిన్‌తో లూప్ లైన్ నుంచి, గయా జంక్షన్ వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో రైలు ఇంజిన్ అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లింది. రైలు ఇంజిన్‌కు బోగీలు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. ఈ ప్రమాదం నుంచి లోకో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

தொடர்புடைய செய்தி