తనకు ఇటీవల ప్రమాదం జరిగిందని ప్రముఖ నటి రష్మిక మందన్నా వెల్లడించారు. దీనిపై సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'నేను పబ్లిక్లో కనిపించి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి చాలా రోజులు అయింది. చిన్న ప్రమాదం జరిగింది. అందువల్ల ఆగస్టులో బయటకు రాలేకపోయాను. ఇప్పుడు సూపర్యాక్టివ్గా ఉన్నా' అని పేర్కొన్నారు. తనకు జరిగింది చిన్న ప్రమాదమేనని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నానని తెలిపారు.