గణేశ్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ శశాంక భక్తులకు సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్సవాల ఏర్పాట్లపై డీసీపీలు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 7న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై 17న నిమజ్జనంతో ముగియనున్నాయని చెప్పారు. నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో సురక్షిత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు.