నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పూర్తి వివరాలను ప్రధానికి సీఎం వివరించారు. కాగా, ఇప్పటికే NDRF, SDRF బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.