వడదెబ్బ తగలకుండా పనులు చేసుకోవాలి

68பார்த்தது
వడదెబ్బ తగలకుండా పనులు చేసుకోవాలి
ఉపాధి హామీ కూలీలు వడదెబ్బ తగలకుండా పనులు చేసుకోవాలని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ఈవో రాహుల్ కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం జన్నారం మండల కేంద్ర శివారులోని కాంకాలమ్మ దేవాలయం సమీపంలో పనిచేస్తున్న కూలీలకు నీడనిచ్చే నెట్, వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్ అనిల్, ఫీల్డ్ అసిస్టెంట్ శీను, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.