నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి

79பார்த்தது
మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామంలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం కల్లాలను బుధవారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుడు ఎంవి గుణ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో జాప్యంతో వడ్లు తడిసి రైతులు నష్టపోయారని ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.