గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి

55பார்த்தது
గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి
గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటించి పోలీస్ వారికి సహకరించాలని తాండూర్ సీఐ కుమార స్వామి అన్నారు. మండలంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను ఆయన సందర్శించి గణేశునికి పూజలు నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గణేష్ మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు‌ అత్యవసరమైతే పోలీసు వారిని సంప్రదించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி