నారాయణపేట మున్సిపాల్టీ నూతన కమిషనర్ గా భోగేశ్వరులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కాగా గతంలో ఇక్కడ పని చేసిన కమిషనర్ సునీత షాద్ నగర్ మున్సిపాలిటీకి బదిలి అయ్యారు.