మహబూబ్ నగర్ - కోస్గి మధ్య రాకపోకలకు అంతరాయం

78பார்த்தது
మహబూబ్ నగర్- కోస్గి పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహమ్మదాబాద్- ఇబ్రహీంబాద్ గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా తాత్కాలిక బ్రిడ్జిపై నుండి వరదనీరు ప్రవహిస్తోంది. ఆ కారణంగా బ్రిడ్జి దాటలేని పరిస్థితి నెలకొంది. ఇక నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్న కారణంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. దాంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

தொடர்புடைய செய்தி