ఓటర్ల జాబితా ప్రచురణ షెడ్యూల్ మార్పు

62பார்த்தது
ఓటర్ల జాబితా ప్రచురణ షెడ్యూల్ మార్పు
వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రచురణ షెడ్యూల్లో మార్పు చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం ఈ నెల 13న పంచాయతీల ఓటర్ల ముసాయిదా జాబితాను ఫొటోలతో వార్డుల వారీగా ముద్రించనున్నట్లు చెప్పారు. ఆ జాబితాను పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారన్నారు. అనంతరం 14 నుంచి 21 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు.