ములకలపల్లి మండలం పూసుగూడెంలో పనిచేస్తున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని శనివారం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్, సిపిఐ మండల కార్యదర్శి ఎండీ యూసుఫ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎండలో పనిచేస్తున్న కూలీలకు కావాల్సిన మంచినీరు, నీడ పందిరిలు లేవన్నారు. వెంటనే ఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు, పంచాయతీ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడి నీళ్లు, నీడ టెంట్స్ వేయించారు. సకాలంలో కూలీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.