సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

52பார்த்தது
రెండురోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లోకి వరద నీరు చేరటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 30వేల టన్నులు, కిష్టారం ఓసీలో 5వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పీఓలు నర్సింహారావు, ప్రహ్లాద్ తెలిపారు. గనుల్లో నీరు చేరటంతో చిత్తడిగా మారింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నీటిని మోటర్ల సాయంతో బయటకు తోడేస్తున్నారు.

தொடர்புடைய செய்தி