ప్రొఫెసర్ కోదండరాం రాక

57பார்த்தது
ప్రొఫెసర్ కోదండరాం రాక
టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బుధవారం కామారెడ్డి జిల్లాకు రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 'ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం- మనమేం చేద్దాం' అనే అంశంపై నిర్వహించే బహిరంగ చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో మేధావులు పాల్గొనాలని కోరారు.

தொடர்புடைய செய்தி