భిక్కనూరు మండల వైద్యాధికారి ఆదర్శ్ ఐదు రోజుల పాటు హైదరాబాదులో శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. హైదరాబాదులోని కోటి ప్రాంతంలో గల రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆయనకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఆయనతోపాటు ఆసుపత్రి స్టాఫ్ నర్స్ చైతన్య సైతం శిక్షణలో పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఆసుపత్రి అధికారులు ప్రశంసా పత్రాలు అందజేశారు.