ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డీఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. మరోవైపు అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి జైనూర్లో మకాం వేశారు.