HYDలో అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా అందరినీ కలవటం ఆనందదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా సమైక్యతా భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. 'అలయ్-బలయ్ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదిక మీద చూడటం ఎంతో ఆనందంగా ఉంది. రాజకీయ విబేధాలు సిద్ధాంతాలకే పరిమితం కావాలి. నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితే, అది కార్యకర్తల వరకు పాకుతుంది' అని వ్యాఖ్యానించారు.