హైదరాబాద్ లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి 23 వరకు చేపట్టిన తనిఖీల్లో మొత్తం 4,056 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కినట్లు అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు. పట్టుబడిన
వారిలో 3,495 మందిపై కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశామన్నారు. మొత్తం 300 మందికి జైలు శిక్ష విధించినట్లు విశ్వప్రసాద్ తెలిపారు.