మల్కాజ్గిరి నియోజకవర్గంలో పలు కాలనీలు, అపార్టుమెంట్లలో మంచినీటి సమస్యలపై వాటర్ వర్క్స్ ఎండి అశోక్ కుమార్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని, సరిపడు మంచి నీటి సరఫరా కల్పించాలన్నారు. రెండు పవర్ బోర్లు ఏర్పాటు చేయాలని ఎండి అశోక్ రెడ్డిని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఎండి తెలిపారు.