హైదరాబాద్లో మనుషులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను చాదర్ఘాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మయన్మార్ నుంచి పిల్లలు, యువతులు మొత్తం ఎనిమిది మందిని అక్రమంగా హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. చాదర్ఘాట్లోని ముసానగర్ కేంద్రంగా ఈ వ్యవహరం నడుపుతున్నట్లు గుర్తించి ముఠాను అరెస్ట్ చేశారు.