ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ నిర్వహిస్తూ సంస్కతీ సంప్రదాయాలను కాపాడటం చాలా గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు అన్నారు. బండారు దత్తాత్రేయ తనయ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. నేటి సమాజానికి సమైక్యత ఎంతో అవసరమని, కుటుంబం, ప్రాంతం, దేశం, ప్రపంచం అనే సమైక్యత భావన పెరగాలని ఆకాంక్షించారు. పండగ అంటే పూజలు, ఆరాధనే కాదు.. పండగ అంటే అందరూ కలసి మెలసి కబుర్లు చెప్పుకోవడం కూడా అని అన్నారు.