టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ ఘోర పరాభవం ఎదుర్కొంది. లీగ్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టింది. దీంతో చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్తోపాటు మరో ఐదుగురు క్రికెటర్లు స్వదేశానికి వెళ్లలేదని వార్తలు వస్తున్నాయి. వీరంతా యూఎస్ నుంచి నేరుగా యూకే వెళ్లినట్లు సమాచారం. ఇందులో మహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీమ్, హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, ఆజం ఖాన్ లండన్ వెళ్తారని సమాచారం.