తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోడంతో తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని ఏఐసీసీ నిర్ణయించింది. పీసీసీ పదవి కోసం ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎంపీలు బలరాంనాయక్, సురేశ్ షెట్కర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.