గంజాయి కేసులో ముగ్గురు అరెస్టు

54பார்த்தது
గంజాయి కేసులో ముగ్గురు అరెస్టు
నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ శివారు ప్రాంతంలో చెట్ల పొదల్లో ముగ్గురు యువకులు గంజాయితో పట్టుబడ్డారు. ఎస్సై సుగుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం రాజు, వంశీ, సాయి కుమార్ తో పాటు మరో నలుగురు యువకులు భద్రాచలం నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చిన గంజాయిని తీగల్పహాడ్ వద్ద పంచుకోవడానికి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో నలుగురు పారిపోగా, ముగ్గురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி