రిమ్స్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

5766பார்த்தது
రిమ్స్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలోని పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం గుర్తించారు. వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గమనించిన వారు అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి వద్ద బంగారిగూడ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి ఫోటో మాత్రమే లభించిందని ఇతర వివరాలేవీ ఆయన వద్ద లేవని అవుట్ పోస్ట్ ఇంచార్జ్ భూమన్న తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ శవాగారానికి తరలించారు.

தொடர்புடைய செய்தி