నాలుగు రోజుల్లో 14 లక్షల లడ్డూల విక్రయం: టీటీడీ

84பார்த்தது
నాలుగు రోజుల్లో 14 లక్షల లడ్డూల విక్రయం: టీటీడీ
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ప్రసాద విక్రయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు తాజాగా స్పష్టం చేశారు. గడిచిన నాలుగు రోజుల్లో మొత్తం 14 లక్షల లడ్డూలు విక్రయించినట్లు వెల్లడించారు. ఈ నెల 19న మొత్తం 3.59 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్‌ 20వ తేదీన 3.17 లక్షలు, సెప్టెంబర్‌ 21న 3.67 లక్షలు, సెప్టెంబర్‌ 22న 3.60 లక్షల లడ్డూలు అమ్ముడైనట్లు తెలిపారు. సగటున రోజుకు 3.50 లక్షల లడ్డూలు విక్రయించామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி