Jul 12, 2024, 17:07 IST/కామారెడ్డి
కామారెడ్డి
మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత
Jul 12, 2024, 17:07 IST
మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరు బాధ్యత అని మండల ప్రత్యేక అధికారి, ఆర్డీవో రంగనాథం అన్నారు. శుక్రవారం కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో మండల ప్రత్యేక అధికారి రంగనాథం పర్యటించారు. గ్రామంలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ, మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరు బాధ్యత అని, మొక్కలు పెంచడం వల్ల మనకందరికీ ఆక్సిజన్ అందుతుందని, వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఎంపీఓ మలహరి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.