ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరం: జనసేననేత కిలారి

53பார்த்தது
వైసీపీ వీడి గురువారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్న పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. సమావేశంలో వైసిపి పై పలు ప్రశ్నలు సంధించిన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో కోటరీ రాజకీయాలు ఉన్నాయని ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరమన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో పనిచేస్తానని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி