రేపు జనసేన పార్టీలో చేరనున్న పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి

85பார்த்தது
గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య రేపు గురువారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. బుధవారం గుంటూరులోని ఆయన కార్యాలయంలో మీడియా ద్వారా ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడచి రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు భాగస్వామి నవుతానని పేర్కొన్నారు. నాయకులు సహకరించాలన్నారు.

தொடர்புடைய செய்தி