గడువులోగా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

61பார்த்தது
ఫిర్యాదుదారుల సమస్యల పట్ల శ్రద్ధ వహించి గడువులోగా పరిష్కరించాలని నరసరావుపేట కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ సూరజ్, డీఆర్ఎ వినాయకంతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி