షిర్డీ సాయి ఆలయానికి పోటెత్తిన భక్తులు

పర్చూరులోని షిరిడి సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే బాబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు సాయిబాబాను దర్శించుకుని బాబా పాలరాతి విగ్రహానికి పాలాభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వంలో గురువును మించిన దైవం లేదని భోధన చేసిన గురు సమానులైన సాయిబాబా కి భక్తులు ప్రణమిల్లారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానాలు జరిగాయి.

தொடர்புடைய செய்தி