కోడి పందెం శిబిరంపై దాడి

ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామంలోని శివారులో బుధవారం రాత్రి కోడిపందాలు ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై సురేష్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు, 6, 290 రూపాయల నగదు, మూడు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఎస్సై సురేష్ తెలియజేశారు. పేకాట, కోడి పందాలు పై నిఘా ఉంచినట్లు ఎస్సై చెప్పారు.

தொடர்புடைய செய்தி