కోలలపూడి కొండ వద్ద జింక కళేబరం కలకలం

మార్టూరు మండల పరిధిలోని కోలలపూడి గ్రామ సమీపాన ఉన్న కొండ వద్ద ఓ జింక కళేబరాన్ని స్థానిక రైతులు మంగళవారం సాయంత్రం గుర్తించారు. ఆ జింక సుమారు మూడు రోజుల క్రితం మృతి చెంది ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఆ జింక తప్పిపోయి చనిపోయిందా లేదా ఎవరైనా చంపేశారా అని స్థానికులు సందేహం లో ఉన్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி