ఒక్కో మహిళకు రూ.2 లక్షలు ఇస్తున్నాం: మంత్రి సీతక్క

61பார்த்தது
ఒక్కో మహిళకు రూ.2 లక్షలు ఇస్తున్నాం: మంత్రి సీతక్క
మూసీ నీళ్లతో స్నానాలు చేసి, నీళ్లను తాగేలా పునరుజ్జీవనం చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మూసీ పునరావాసం పొందిన 17 స్వయం సహాయక మహిళా సంఘాలకు చెందిన 172 మంది మహిళలకు రూ. 3.44 కోట్ల విలువైన నగదు చెక్కుల‌ను శుక్రవారం సీత‌క్క పంపిణీ చేసి మాట్లాడారు. నిర్వాసితుల్లోని ఒక్కో మహిళకు రూ.2 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. మూడేళ్లలో నెలకు రూ.2 వేల చొప్పున రూ. 60 వేలు చెల్లిస్తే చాలన్నారు. రూ. 1.40 లక్షలు ఉచితంగానే ఇస్తున్నామని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி