గ్రేటర్ వరంగల్ పార్కుల నిర్వహణ సమర్థవంతంగా జరగాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా హనుమకొండ పరిధి హాసన్ పర్తిలో బల్దియా చే నిర్వహించబడుతున్న కుక్కల శస్త్రచికిత్స కేంద్రంతో పాటు శ్రీనగర్ కాలనీ పార్క్ శాంతి వనంతో పాటు వరంగల్ పరిధి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు గల రీజనల్ లైబ్రరీ పార్కులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు సూచనలు చేశారు.