గట్టు మల్లన్న ఆలయంలో భక్తుల కోలాహలం

59பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మలికుదుర్ల గ్రామంలో కొలువైన శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారంను పురస్కరించుకొని భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని ఆ మల్లన్న స్వామికి ఒగ్గు పూజారుల చేత పట్నాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.