నెయ్యి కల్తీ ఘటనపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

83பார்த்தது
నెయ్యి కల్తీ ఘటనపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. తాజాగా నెయ్యి కల్తీ ఘటనపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఏఆర్‌ డెయిరీ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి తూర్పు పీఎస్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி