దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ సందర్భంలో కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ను ప్రకటించాడు. 'ఇది నా చివరి T20 వరల్డ్కప్. మేము సాధించాలనుకున్నది ఇదే. దేవుడు గొప్పవాడు. నేను కృతజ్ఞతతో తల వంచుకుంటాను. ఇది చాలా ముఖ్యమైనది అయినప్పుడు నేను ముందుకు సాగగలను.' అని కోహ్లీ తెలిపాడు.