మణిపూర్లో గతేడాది ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను మెయిటీ కమ్యూనిటీకి చెందిన అల్లరిమూకలు రోడ్డుపై నగ్నంగా ఊరేగించాయి. అంతకు ముందు ఆ మహిళలు తమను కాపాడాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే అల్లరిమూకలకు ఆ మహిళలను పోలీసులే అప్పగించినట్లు సీబీఐ విచారణలో తేలింది.