ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 5 గంటలు విమానంలోనే ప్రయాణికుల నిరీక్షణ

52பார்த்தது
ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 5 గంటలు విమానంలోనే ప్రయాణికుల నిరీక్షణ
ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణికులు 5 గంటల పాటు ఫ్లైట్ లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన ముంబైలో జరిగింది. ఈ విమానం ముంబై నుంచి ఖతర్ రాజధాని దోహాకు వెళ్లాల్సి ఉంది. కాగా "ఇమ్మిగ్రేషన్ ముగియడంతో మమ్మల్ని కిందకు దిగనీయలేదు. మేము ఎదురుతిరిగాక వారు మమ్మల్ని హోల్డింగ్ ఏరియాలో వేచి ఉండటానికి అనుమతించారు” అని ప్రయాణికులు తెలిపారు. మా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని, తమకు నీళ్లు కూడా ఇవ్వలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி