ఎట్టకేలకు టీమిండియా స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 6 గం. ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా దిగింది. టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత క్రికెటర్లకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సి ఉన్నప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్ లోనే ఉండిపోయారు. తుఫాను కాస్త తగ్గడంతో బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి వారిని తీసుకొచ్చింది.