గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే షుగర్ బీపీ పేషెంట్లకు క్రమం తప్పకుండా మందులు ఇవ్వాలని షాద్ నగర్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వి విజయలక్ష్మి సూచించారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఏరియాలోని కిషన్ నగర్ సబ్ సెంటర్లో వైద్యాధికారి డాక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యమేళా ప్రోగ్రామును డాక్టర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు.