ఆదిలాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. సారంగాపూర్, నర్సాపూర్ (జి) మండలంలోని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.