50 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత: పీవో

71பார்த்தது
50 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత: పీవో
ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని 50 ఆశ్రమ పాఠశాలల్లో టెన్త్ ఫలితాలలో 100% ఉత్తీర్ణత వచ్చిందని ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలో పనిచేస్తున్న వివిధ ఆశ్రమ పాఠశాలల్లో టెన్త్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. సుమారు 50 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత వచ్చిందని తెలిపారు. వచ్చే సంవత్సరం అన్ని పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తామన్నారు.