అధికారుల నిర్లక్ష్యం.. రైతుబంధు నగదు వెనక్కి

36604பார்த்தது
అధికారుల నిర్లక్ష్యం.. రైతుబంధు నగదు వెనక్కి
తెలంగాణలో రైతుబంధు డబ్బుల జమలో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు సొమ్ము సక్రమంగా ఖాతాల్లో జమ చేయకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలోనే జమవుతున్నాయి. బ్యాంకు అకౌంట్ నంబర్లలో తప్పులు, ఇంటి, రైతుల పేర్ల మార్పు, ఖాతాలు ఫ్రీజ్ కావడం, డిఫాల్టర్ అయిన ఖాతాలు వంటి పలు అంశాలు ఇందుకు కారణం. మరోవైపు ఐదెకరాలలోపే భూమి ఉన్నా తమకు ఇంకా రైతుబంధు నగదు అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி