వేములవాడ రాజన్న సన్నిధిలో మంత్రి కొండా సురేఖ

68பார்த்தது
వేములవాడ రాజన్న సన్నిధిలో మంత్రి కొండా సురేఖ
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనవడి పుట్టు వెంట్రుకల మొక్కులు స్వామివారికి చెల్లించుకున్నామని తెలిపారు. మంత్రి అయిన తర్వాత ఇంతకుముందు కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చామన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఈవోను కూడా మార్చామని గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி