రైతులను మోసం చేసిన నిందితుడికి జైలుశిక్ష

55பார்த்தது
రైతులను మోసం చేసిన నిందితుడికి జైలుశిక్ష
రైతులను మోసం చేసిన భూరం చంద్రమోహన్ అనే వ్యక్తికి సోమవారం మంచిర్యాల జూనియర్ సివిల్, ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి సంపత్ మూడేళ్ళ సాధారణ జైలుశిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించారు. నిందితుడు రామకృష్ణాపూర్ ప్రాంతంలో పలువురు రైతుల వద్ద పత్తి కొనుగోలు చేసి ఏడాది కాలంగా డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధించారు.