ఉడిత్యాల- బాలానగర్ రాకపోకలు బంద్

80பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పనులు ఇటీవల చేపట్టారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఆదివారం ఉడిత్యాల- బాలానగర్ రాకపోకలు నిలిచిపోయాయి. గత పదేళ్లుగా వంతెన నిర్మించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులు ప్రయాణికులు కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி