ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

71பார்த்தது
ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
టేకులపల్లి మండల పిఆర్టియు నూతన కార్యవర్గ ఎన్నిక సందర్భంగా మండల కేంద్రంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి పిఆర్టియు జిల్లా అధ్యక్షులు వేంకటేశ్వరరావు ఉపాధ్యాయుల సమస్యలనుద్దేశించి మాట్లాడుతూ కేవలం నెల జీతాలపై ఆధారపడి జీవిస్తున్న ఉపాధ్యాయులకు ప్రస్తుత పరిస్థితుల్లో సొంతింటి కల నెరవేరడం చాలా కష్టంగా మారింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇళ్లస్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.